
సింహాద్రిపురం మన జనప్రగతి మార్చి 04:
సింహాద్రిపురం మండలంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన అంకాలమ్మగూడూరులోని శ్రీ శ్రీ శ్రీ అంకాలమ్మ దేవస్థానం పరిధిలో టెంకాయల విక్రయానికి సంబంధించి బహిరంగ వేలం
మార్చి 07 తేదీన (శనివారం)
సమయం ఉదయం 8:00 గంటల నుండి అంకాలమ్మ గూడూరు కళ్యాణ మండపం లో నిర్వహించనున్నట్లు ఆలయ నిర్వాహకులు తెలిపారు.ఈ మేరకు వేలం పాటకు సంబంధించిన నిబంధనలు మరియు వివరాలను వెల్లడించారు.
వేలంలో పాల్గొనదలచిన వారు ముందుగా రూ.1,00,000/- (అక్షరాలా ఒక లక్ష రూపాయలు) డిపాజిట్ చెల్లించి తమ పేరు నమోదు చేసుకోవాలని,వేలం ప్రక్రియ ముగిసిన తర్వాత ఈ మొత్తాన్ని తిరిగి చెల్లించడం జరుగుతుందన్నారు.
వేలం దక్కించుకున్న వారు, తాము పాడిన మొత్తంలో సగభాగాన్ని (50%) వేలం ముగిసిన వెంటనే దేవస్థానానికి చెల్లించాలని,మిగిలిన సగం మొత్తాన్ని రాబోయే శ్రీరామనవమి పండుగ రోజున చెల్లించాల్సి ఉంటుందని
భక్తుల సౌకర్యార్థం ఒక టెంకాయ,ఆకులు,వక్క, అగరబత్తుల ప్యాకెట్ ధరను రూ. 40/- గా ఆలయ కమిటీ నిర్ణయించిందని అంతకంటే ఎక్కువ ధరకు విక్రయించకూడదని స్పష్టం చేశారు.మరిన్ని వివరాల కోసం మరియు ఇతర సమాచారం కోసం ఆలయ నిర్వాహకులను ఈ క్రింది ఫోన్ నంబర్ల ద్వారా సంప్రదించవచ్చు అని అన్నారు.
📞 8217221753
📞 8919095189




