
విశ్వశాంతి భవన్ ప్రారంభోత్సవంలో పాల్గొన్న ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి.
పులివెందుల అర్బన్ మన జనప్రగతి మార్చి 14:- పులివెందుల పట్టణంలో ప్రజాపిత బ్రహ్మకుమారీస్ ఈశ్వరీయ విశ్వవిద్యాలయం వారి విశ్వశాంతి భవన్ ప్రారంభోత్సవం ఘనంగా జరిగింది.ఈ ఆధ్యాత్మిక కార్యక్రమానికి కడప పార్లమెంట్ సభ్యులు వైఎస్ అవినాష్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.భవన ప్రారంభోత్సవం అనంతరం,ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి రాజయోగిని జయంతితో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు.ఈ ఉద్ఘాటన వేడుకల్లో వేంపల్లె,కడప,ప్రొద్దుటూరు,రాజంపేట ప్రాంతాలతో పాటు కర్ణాటక,తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుండి పెద్ద సంఖ్యలో ఓం శాంతి బ్రహ్మకుమారీలు పాల్గొన్నారు.ఆధ్యాత్మికత ద్వారానే మనశ్శాంతి లభిస్తుందని, ఇలాంటి సేవా కేంద్రాలు సమాజానికి ఎంతో అవసరమని ఈ సందర్భంగా పలువురు పేర్కొన్నారు.




