అంతర్జాతీయంఆంధ్ర ప్రదేశ్క్రైమ్తెలంగాణరాజకీయంసినిమా

వారధి సెంటర్ ప్రమాద బాధితులకు పరామర్శ

30 రోజుల్లో ఇల్లు కట్టించి ఇస్తామని భరోసా

నెల్లూరు మన జనప్రగతి ఫిబ్రవరి 28:-

53 డివిజన్ పరిధిలోని వారధి సెంటర్, షుగర్ ఫ్యాక్టరీ సమీపంలో ఘోర ప్రమాదం చోటు చేసుకున్న విషయం తెలిసిందే..నియంత్రణ కోల్పోయిన ఒక లారీ డివైడర్‌ను దాటుకుంటూ వచ్చి పక్కనే ఉన్న నివాసంపైకి దూసుకెళ్లడంతో ఇంటికి ఉన్న నాలుగు గోడలలో మూడు గోడలు పూర్తిగా కూలిపోయాయి. ఈ ఘటనలో మస్తానమ్మ మరియు హుస్సేన్ అనే ఇద్దరు వ్యక్తులు తీవ్రంగా గాయపడగా, హుస్సేన్ కాలు చీలిపోవడం, మస్తానమ్మ మెడ ఎముక విరిగి శస్త్రచికిత్స చేయించుకోవాల్సి రావడం వంటి విషాదకర పరిస్థితులు నెలకొన్నాయి. సమాచారం తెలుసుకున్న వెంటనే రాష్ట్ర మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ ఘటన జరిగిన వెంటనే పదివేల రూపాయలను ఆర్థికంగా సాయం చేశారు అనంతరం నెల్లూరు కు వచ్చిన వెంటనే నారాయణ స్వయంగా ఘటన స్థలాన్ని పరిశీలించి, బాధితుల నివాసానికి వెళ్లి వారిని పరామర్శించారు. తక్షణ సాయం కింద 10,000 రూపాయల ఆర్థిక సాయాన్ని అందించడమే కాకుండా, కూలిపోయిన ఇంటిని రాబోయే 30 రోజుల్లోగా పూర్తి స్థాయిలో పునర్నిర్మించి ఇస్తామని బాధితులకు గట్టి హామీ ఇచ్చారు…

ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ బీద రవిచంద్ర, మేయర్ దేవరకొండ సుజాత అశోక్, డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్, కమిషనర్ నందన్, మాజీ మున్సిపల్ చైర్ పర్సన్ తాళ్ళపాక అనురాధ, మాజీ జెడ్పిటిసి విజేత రెడ్డి, డివిజన్ అధ్యక్షులు సుధాకర్ రెడ్డి, స్థానిక టిడిపి ముఖ్య నేతలు నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button