
ప్రొద్దుటూరు మన జనప్రగతి ఫిబ్రవరి 23:-
ప్రొద్దుటూరు పట్టణంలోని వైఎంఆర్ కాలనీ పట్టణ ఆరోగ్య కేంద్రం లో మరమ్మత్తులు, ఫ్లోరింగ్ పనులు త్వరగా చేపట్టాలని భారతీయ జనతా పార్టీ పట్టణ అధ్యక్షుడు ఆధ్వర్యంలో కడప కలెక్టరెట్ లో పబ్లిక్ గ్రీవెన్స్ రీ అడ్రసల్ సిస్టమ్ నందు కోరారు. పట్టణంలోని వైఎమ్ఆర్ కాలనీ నందలి పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నందు రిపేర్స్ మరియు కాంపౌండ్ లోపల ఫ్లోరింగ్ కొరకు ఆరోగ్య శాఖ మంత్రి సత్య కుమార్ తో మాట్లాడి సిడిఎంఏ నుండి గత ఏడాది జనవరి 8వ తేదిన లెటర్ వచ్చిందని, కాని ఇప్పటి వరకు దానిపై ఎలాంటి స్పందన లేదని వివరించారు. డిఆర్వో ప్రొద్దుటూరు మునిసిపల్ కమీషనర్ కి ఫోన్ చేసి త్వరగా పనులు చేయించాలని కోరారు.



