
పులివెందుల అర్బన్ మన జనప్రగతి ఫిబ్రవరి 23:-పులివెందుల పట్టణంలోని మెయిన్ బజార్లో ట్రాఫిక్ సమస్య అస్తవ్యస్తంగా మారింది.సోమవారం పట్టణంలోని స్థానిక శ్రీవేంకటేశ్వర స్వామి ఆలయం వద్ద డీఎస్పీ మురళీ నాయక్ స్వయంగా ట్రాఫిక్ను క్రమబద్ధీకరించారు.రోడ్డుకు ఇరువైపులా అడ్డదిడ్డంగా వెళ్తున్న వాహనాలను ఆపి వాహనదారులకు సూచనలు చేశారు.వాహనదారులు ట్రాఫిక్ రూల్స్ పాటించాలన్నారు.ఆయన వెంట పోలీస్ సిబ్బంది ఉన్నారు.




